Advertisement
Not a member of Pastebin yet?
Sign Up,
it unlocks many cool features!
- మేము విశాఖపట్నం లో ఉండివాళ్ళము.చిన్నపుడు నేను ప్రైవేట్ స్కూల్ చదువుకునేదాని ఎనిమిదో తరగతి లో ఒక్క ఫ్రెండ్ ఉండివాడు . అప్పుడు లో ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళు ఒంగోలు వెళ్లిపోయారు.నేను బిటెక్ మూడో సవంత్సరం ఉన్నపుడు ఫేస్బుక్ లో నవంబర్ లో తాను నాకు మెసేజ్ చేసాడు .కొన్ని రోజులు మాట్లాడగా తన మంచితనం, కేరింగ్, తాను మాట్లాడే విధానం నచ్చి తనంటే ఇష్టం కలిగింది.ఫిబ్రవరి లో నేనే తనని ప్రొపొసె చేసాను దానికి తాను కూడా చాల హ్యాపీ ఫీల్ అయ్యి ఒప్పుకున్నాడు.మే లో బిటెక్ కంప్లీట్ అయ్యాక తాను కోచింగ్ పేరుతో ఒంగోలు నుంచి వైజాగ్ వచ్చాడు.తాను వచ్చిన రోజు తెలియని భయం,సంతోషం ఆ ఫీలింగ్ ఏంటో మాటల్లో చెప్పలేను కానీ లైఫ్ లో కొత్త ఎక్స్పీరియన్స్ అది నాకు బాగ్ నచ్చింది.తాను రాగానే మనం గుడికి వెళదామని అన్నాడు దానికి నేను సరే అన్న. మేము అన్నవరం కి బస్సు లో స్టార్ట్ అయ్యాం బస్సు లో చెప్పాడు "తాను ఏ అమ్మాయితో ఐతే గుడికి వెళ్తానో తనతోనే న పెళ్లి జరిగుతుందని, అది తన నమ్మకం అని చెప్పాడు".ఆ మాటకి నేను చాల హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే కలవగానే ఈ మూవీ కో ,షికార్లకు పోవేళనే అబ్బాయిలకి తిను అన్న మాట నాకు కొత్తగా అనిపించి ఇంకా తన మీద ఇష్టం పెరిగింది.ఆలా ఆరోజు అన్నవరం లో దర్శనం తో ఆ రోజు ముగిసింది.ఆ మూడు నెలలు రోజు కలిసి కాసేపు మాట్లాడుకొని వెళ్లిపోయే వాళ్ళం.అనుకోకుండా మూడో నెలలో మార్నింగ్ రైతు బజార్ లో కలిసినప్పుడు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చూసి మా డాడీ కి చెప్పినట్టు నాకు తెలిసింది.ఎప్పుడైతే మా డాడీ నన్ను "ఇక బజారు కి వీళ్ళటం తగ్గించమ్మ అని చెప్పినప్పుడు ".కానీ మా ఫామిలీ వాళ్ళు అబ్బాయితో తిరగటం తప్పని ఫీల్ అయ్యి చెప్పారు కానీ తనకి నాకు లవ్ అని వాళ్ళు అనుకోలేదు అందుకే ఏ గొడవ జరగకుండా మిగిలిన రోజులు కూడా సాఫీగా సాగిపోయాయి.
Advertisement
Add Comment
Please, Sign In to add comment
Advertisement